గంజాయి రవాణా కేసులో పదేండ్ల జైలు.. హన్మకొండ ఎన్‌‌‌‌డీపీఎస్ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జిమెంట్

గంజాయి రవాణా కేసులో పదేండ్ల జైలు.. హన్మకొండ ఎన్‌‌‌‌డీపీఎస్ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జిమెంట్

ధర్మసాగర్(కాజీపేట), వెలుగు: గంజాయి అక్రమ రవాణా కేసులో ఓ వ్యక్తికి పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ హనుమకొండలోని ఎన్‌‌‌‌డీపీఎస్ స్పెషల్​సెషన్స్ కోర్టు జడ్జి అపర్ణాదేవి తీర్పు చెప్పారు. 2016 సెప్టెంబర్ 24న కాజీపేట జీఆర్‌‌‌‌పీ ఎస్సై దయాకర్ తన సిబ్బందితో కలిసి రైల్వే ప్లాట్‌‌‌‌ఫామ్​పై తనిఖీలు చేస్తుండగా.. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపల్లి మండలం చిన్నపల్లెకు చెందిన దొండేటి రామాంజనేయులు 28 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు.

అప్పటి సీఐ మధుసూదన్ కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం సీఐ స్వామి కోర్టులో చార్జిషీట్​దాఖలు చేశారు. పీపీ రాజమల్లు రెడ్డి కోర్టులో వాదనలు వినిపించగా, కాజీపేట జీఆర్‌‌‌‌పీ సీఐ నరేశ్​నేతృత్వంలో పోలీసులు సాక్షులను హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో రామాంజనేయులుకు జడ్జి మంగళవారం శిక్ష ఖరారు చేశారు.